కుసుమాంజలి - కృతిసమర్పణ
శ్రీ గురువులు, స్వగురువులు - శ్రీ శ్రియానందనాథులు.
పరమగురువులు - శ్రీ విద్యానందనాథులు.
పరమేష్ఠిగురువులు - శ్రీ మహావిద్యానందనాథులు
వరాపరగురువులు - శ్రీ పరిపూర్ణ ప్రకాశానందనాథులు
కాత్యాయనీ మైత్రేయీ సమేత శ్రీ మాజ్ఞవల్క్య బ్రహ్మర్షిని స్మరించి, మహాత్ములకును, వంశఋషులకును ఎఱగి, శ్రీశ్రీశ్రీ శ్రియానందనాథ తద్వతీ పరాంబా దివ్యమణి పాదుకా7ద్వయా7ఖండ సర్వస్వరూపమునకు తాదాత్మ్య భావమున ప్రణమిల్లి అనన్యమైన నిశ్చలమైన భక్తిపురస్సరముగా ఉపనిషన్మధువు లొలుకు ''శ్రీతత్త్వ'' మను ఈ గ్రంథసుమమును సమర్పించుకొనుచున్నాను.
'హే శ్రియానంద భగవ9' ప్రసన్నచిత్తమున పరిగ్రహించి ఆశీర్వదింపుడు.
భౌతికముగా మనలను వీడిన ''కమల'' కు ఆత్మశాంతిని ప్రసాదింపుడు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమావాయ పూర్ణమేవావ శిష్యతే||
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.
-- గ్రంథకర్త.